ప్రవక్త : మానవాళి సందేశం : vachana kavithaa sourabham
ప్రవక్త : మానవాళి సందేశం : vachana kavithaa sourabham
ప్రవక్త : మానవాళి సందేశం
మానవ మహోపకారి జాతీయ స్థాయి కవితల పోటీ కొరకు
అంశం: మానవ మహోపకారి
శీర్షిక: ప్రవక్త : మానవాళి సందేశం
కవిత...వచన కవితా సౌరభం ..16 నుంచి 20 లైన్లు
పేరు: కవీశ్వర్ : జయంత్ కుమార్
ఊరు: రాజేంద్రనగర్ , హైదరాబాద్
సెల్: 970 3673692
హామీ పత్రం .: ఈ వచన కవితా సౌరభంనా స్వీయ రచన . ఎవరి అనుకరణ కానీ, అనుసరణ కానీ కాదు . ఈ పోటీ కోసం రచించినది. కవీశ్వర్ అనే కలం పేరుతో ....
శీర్షిక: ప్రవక్త : మానవాళి సందేశం
అరబ్బు ద్వీపకల్పం లో జనియించి .... తొలుత తల్లిదండ్రులని కోల్పోయినావు
మక్కాలో పునర్నిర్మించిన కాబా ..... నూతన మతావిష్కరణకు నాందీ కార్యం చూపినావు
కాబారాతి కి ప్రాముఖ్యతను తెచ్చేవు .... నమాజులతో , ధ్యానముతో అల్లాహ్ ను చూపినావు
సకల మతాల సారాన్ని ఒక్కటేనన్నావు ... మానవత్వమే జీవితానికి మనుగడ అన్నావు.
అందరికీ భగవంతుని పూజించమన్నావు... మంచితనమే సౌబ్రాతృత్వాన్ని నిలబెట్టునన్నావు
మక్కా , మదీనా లను పుణ్యక్షేత్రాలుగా చేసేవు .. ఇస్లామే మీ సంప్రదాయ పరిణితి అన్నావు
పరమత సహనాన్ని , శాంతిని ప్రేరేపించావు ... ఈర్ష్య అసూయా ద్వేషం భివృద్ధికి తగదన్నావు
పరికించి చూసినా భగవంతుడే గొప్పన్నావు ... ప్రవచన వక్త గా , శాంతి దూత గా వర్ధిల్లినావు
వ్యాఖ్య : ఎందరికో మార్గదర్శిగా మారి ...... ఆశావాద కిరణాలను దశదిశలా ప్రకాశింప జేశావు ..
కవీశ్వర్ : 13 10 . 2021 .