పీవీ నరసింహారావు
పీవీ నరసింహారావు
పివి మొగ్గలు
క్లిష్ట పరిస్థితుల్లో వున్న దేశ స్థితిగతులను
భారత ప్రధానిగా తన చతురతతో చక్కబెట్టాడు
రాజనీతిజ్ఞుడు గా ఆయనకు ఆయనే సాటి
బహుభాషా కోవిదుడిగా అపార అక్షర సంపదతో
తన స్వీయచరిత్ర ను లిఖించి ఆదర్శమై నిలిచాడు
సుగుణశీలి పాములపర్తి విమలమూర్తి నరసింహారావు
నాటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేతనమై నిలిచి
దేశకీర్తిని తెలుగు వెలుగును నలుదిశలా చాటినాడు
మకిలి పట్టని మలినమంటని మట్టిలో మాణిక్యమయినాడు
సరికొత్త ఆలోచనలతో ప్రపంచీకరణను స్వాగతించి
స్వీయ క్రమశిక్షణతో సాగిన స్వయం ప్రకాశకుడు
స్వతంత్ర భారతావని ధృవతారగా నిలిచాడు
అచ్చతెలుగు దనం ఉట్టిపడే ఆహార్యంతో
హంగు ఆర్భాటం చూపని మౌనమే తన ఆభరణం
ప్రపంచ కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్రాన నిలిపిన మేధాసంపన్నుడు