1986 నుంచి నా రచనా వ్యాసరంగం ఆంధ్రభూమి దినపత్రికలో ఏడిద ప్రసన్నలక్ష్మి పేరుతో నేటికథలు రాయడంతో మొదలుపెట్టాను. వివాహం తర్వాత 1988 నుంచి శానాపతి (ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరుతో ఇప్పటి వరకూ అప్పుడప్పుడు రాసిన కథలు 200 పైగా వివిధపత్రికల్లో ప్రచురించబడ్డాయి. నేను రాసే కథలన్నీ ఎక్కువుగా క్లుప్తంగా... Read more
1986 నుంచి నా రచనా వ్యాసరంగం ఆంధ్రభూమి దినపత్రికలో ఏడిద ప్రసన్నలక్ష్మి పేరుతో నేటికథలు రాయడంతో మొదలుపెట్టాను. వివాహం తర్వాత 1988 నుంచి శానాపతి (ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరుతో ఇప్పటి వరకూ అప్పుడప్పుడు రాసిన కథలు 200 పైగా వివిధపత్రికల్లో ప్రచురించబడ్డాయి. నేను రాసే కథలన్నీ ఎక్కువుగా క్లుప్తంగా వుండే చిన్న కథలే. Face book మణి మాలిక(ద్విపాద కవితల రంగవల్లిక) గ్రూప్ నందు సభ్యురాలై 3000 వరకూ ద్విపదలు రాసాను. అన్నయ్య ఏడిద గోపాలకృష్ణ మూర్తి ప్రోత్సాహమే నేను రచయిత్రిగా ఎదగడానికి కారణం.
మా మావారు శానాపతి రంగధామ్.BSNL ఉద్యోగి. మాకిద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీకృష్ణ చిరంజీవి సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్న కుమారుడు శ్రీహర్షవర్ధన్ డాక్టర్. Read less