లౌకిక మత రాజ్యం - వచన కవితా సౌరభం : కవీశ్వర్
లౌకిక మత రాజ్యం - వచన కవితా సౌరభం : కవీశ్వర్
లౌకిక మత రాజ్యం : 25. 07. 2021 : kaweeshwar
అంశం :మత సామరస్యం : శీర్షిక : లౌకిక మత రాజ్యం
రచన :వచన కవితా సౌరభం
మన రాజ్యాంగ కర్తలు, పెద్దలుమహోన్నతం గా నుడివిరి .
మన రాజ్యము మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యమని
అందరి వేల్పు ఒక్కడే అనిన దేశములో కలహములేల ?
మనదేశములో ఎన్నియో తార్కాణములు కలవు అని
మచ్చు తునకలు : వేములవాడ రాజన్న సన్నిధి లో గల దర్గా :
దేవునికడపలో బిబి నాంచారమ్మ వెంకన్నను చేపట్టి తరియించె కదా !
భాగమతి ఖులీ తుబ్ షాహ్ ని వరియించె కదా !
గాయకుల నోట మతసామరస్య పాటలు ప్రసిద్ధి గాంచె కదా !
దేవుడు ఒకడే ఆ దైవం ఒకటే అల్లా అని పిలిచినా ….
ఘంటసాల , మొహ్మద్ రఫీ, సుశీల లతా మంగేష్కర్ లాంటి
గాయనీ గాయకుల నోట మతసామరస్య పాటలు
ఎంతో రమణీయం : సినారె , ఆనంద్ బక్షి మొదలగు
గీత రచయితల కమనీయ రచనల జనాదరణ రంజకం
కలహాలెందుకు - పరమత సహనం లేనందుకే కదా !
ఎవరి ధర్మాన్ని వారనుసరిస్తే ఒండొరులకు కినుకలెందుకు ?
దేశ పురోగతి - ఐకమత్య , సహాయ- సహకారాల పైనే కలదని ఎందుకు ఆలోచించరు?
కులాంతర , మతాంతర వివాహాల ప్రస్తావనలో కలహాలెందుకో ?
సంయమనం ఎందుకు పాటింపరో?
భారతదేశం నా మాతృ భూమి - భారతీయులందరు
సోదర సోదరీమణులు అన్నప్పుడు - ఎందుకు కలతలు- కొట్లాటలు ?
అలౌకిక విషయాలపైన లౌకికవాదులు చర్చించకుంటే
అరిషడ్వార్గాలను మన కంట్రోల్ లో ఉంచుకుంటే
దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడితే , అభివృద్ధిలో భాగమైతే
మతసామరస్యానికి ఎలాంటి కీడు వాటిల్లదని నా అభిప్రాయం .