ఘాజీ ఘటోత్కచ
ఘాజీ ఘటోత్కచ
రాణా గజేంద్ర ఆర్మీలో అత్యంత శక్తి గల సైనికుడు.
మరియు తెలివిగలవాడు.
అందుకే అతన్ని అందరూ "ఘాజీ ఘటోత్కచ్ గంజేంద్ర" అని పిలిచేవారు.
భారత్, పాకిస్థాన్ లకి జరిగిన యుద్ధాలలో
ఎంతో చాకచక్యంగా పోరాడి విజయాలను కలిగించిన
రాణా గజేంద్ర అంటే అందరికీ గౌరవం,
అతని వీర గాధలు వింటుంటే గర్వం,
యుద్ధం చేయడానికి సైనికులకు పౌరుషం,
ఉత్సాహం కలుగుతాయి.
రాణా గజేంద్ర ఎప్పుడూ తన తోటి సైనికులకు
తన మాటలతో ధైర్యం నూరిపోసేవారు.
ఎంతో మంది సైనికులకు ఆదర్శంగా నిలిచారు.
ఏదైనా కష్టం వచ్చింది అంటే సమస్యని ఎదిరించాలి.
సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ముందు మనలో ఉన్న భయాన్ని తరిమేయాలి.
యుద్ధం అనగానే బయపడి వెనక అడుగు వేయడానికి
ఏ కారణం మనల్ని ఆపకూడదు.
మనం ముందే నిర్ణయించుకుని వచ్చాం.
దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వగలమని.
పిరికితనాన్ని దాటుకుని ముందుకు అడుగు వేయడానికి మనం మన దేశం సరిహద్దుల్లో ఉండటం వల్లే మన దేశ ప్రజలు నిశ్చింతగా నిద్ర పోతున్నారు అనే ఈ ఒక కారణం చాలు మనకి మనసుకి తృప్తి.
అని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవారు.
జీవితంలో...
సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే...
ముందు
మనలో ఉన్న భయాన్ని తరిమేయాలి...
ఏదైనా కష్టం వచ్చింది అంటే సమస్యని ఎదిరించాలి...
సమస్యని సృష్టించిన పరిస్థితి అంతు చూడాలి... సమస్యని పరిష్కరించుకొని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి...
కష్టం రాగానే బయపడి వెనక అడుగు వేయడానికి వంద కారణాలు ఉంటాయి...
కానీ ఆ కష్టం దాటుకుని ముందుకు అడుగు వేయడానికి ఒక కారణం అయినా ఉంటుంది.
జీవితానికి...
ఎదురు నిలిచి పోరాడండి...
గెలుపు మీకే సొంతం..