కవితా పురాణం
కవితా పురాణం


"ఖర పాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్"
పూరణ : కవిత లాగ పూర్తి చేసాను- ఛందో బద్ధముగా ఉండకపోవచ్చు .
జరామరణము గల భక్తుల సృజనయగు జగజ్జననిసృష్టి కారకులైన య
ప్పరమేశ్వరుని మనోవాంఛి తులైన సుజన భక్త పరమాణువు ల నిశ్చల చిత్తచాంచల్య ము లేక బ్రహ్మ
మరయంగానర్ధనారీశ్వర దర్శనము నాకు నవవిధ భక్తిమార్గము నరయగానాత్మయందే గల ఆ సోమశే
ఖరపాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్ !
భావం : చావు పుట్టుకలు గల భక్తుల ను స్రుజుంచినట్టి జగన్మాత , మరియు సృష్టి కారకులగు ఆ పరమేశ్వరుని
యొక్క మనో వాంఛితులైనట్టి,మంచి భక్త జనులగు పరమాణువుల లాంటి వారైనట్టి ,చలనము లేనట్టి చపల చిత్తము లేక
జ్ఞానమును తెలుసుకొనగా , ఆ అర్థ నారీశ్వరుని దర్శనము నాకు తొమ్మిది విధముల భక్తి మార్గములలో వెతకగా ,
ఆత్మ యందె కల ఆ సోమశేఖరుని పాద ములను అర్చించడమొక్కటే నాకు హితము ముమ్మాటికీ. అని ఈ పూరణము
యొక్క భావము . #####