సగటు మనిషిలో ప్రపంచ శాంతి
సగటు మనిషిలో ప్రపంచ శాంతి
పొద్దున్నే వార్తాపత్రికలో యాసిడ్ దాడి గురించి చూశాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో
శ్రమ దోపిడీ గురించి విన్నాడు.
సాయంకాలం పార్కులో
ఆర్థిక నేరాల గురించి ప్రసంగం జరుగుతుంటే అటుగా వెళ్ళాడు.
రోజంతా ఏదో మాట్లాడుదామని అనుకుంటూ గడిపాడు.
సగటు మనిషి ప్రపంచంలో జరిగే ప్రతి విషయంలో
తన బాధ్యత ఉందని అనుకున్నాడు.
రాత్రి పర దేశంలో జరిగిన జాతి విద్వేషపూరిత దాడిలో
తన బంధువులు లేరని తాపీగా నిద్ర పోయాడు.
ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఆలోచనలు
ప్రతి చోటా వివిధ రూపాల్లో పెరుగుతున్నాయని
మరచిపోయాడు.
మాటల ఆయుధాలను పోగు చేసుకుంటూ
ఉండిపోయాడు.
సగటు మనిషి నీలానే మూగబోయాడు కదూ..