అద్భుతః
అద్భుతః
తిండి కలిగితే కండ కలదని గురజాడ వారు అన్నారు.
అప్పదాసు గారు ఆ మాట పట్టుకుని మూడు పూటలు తెగ తిన్నారు అంటూ బుచ్చి అప్పదాసు నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది.
అప్పదాసు మాత్రము దిబ్బ రొట్టె మీద తేనె రాసి తింటున్నాడు.
మొట్టికాయ తినగానే అప్పదాసు సావిత్రి దగ్గరికి వెళ్ళి చూసావుటే సావిత్రీ ఈ బుచ్చి ఏం చేసిందో అంటూ తవుడు కలుపుతున్నాడు.
అప్పుడే మామిడి కాయ ఒకటి తీసుకుని వచ్చి ప్రక్కనే కూర్చుంది బుచ్చి. ఇదిగో ఈ కాయ కొంచెం పగులగొట్టి ఇవ్వొచ్చు కదా అంది బుచ్చి. దానికి ఉప్పూ కారం తగిలించి తింటే కదా అసలు స్వర్గ ప్రాప్తి అని సావిత్రితో అన్నాడు అప్పదాసు.
ఏదీ పగలగొట్టు చూద్దాం అంటూ బుచ్చి మామిడి కాయను విసిరింది.
నా మామిడి కాయ అంటూ అప్పదాసు లేవడం ఆ మామిడి కాయ సావిత్రి ముందు పడి దానిని సావిత్రి ఆరగించడమూ రెప్పపాటులో జరిగిపోయాయి.
అప్పదాసు అయ్యో అంటూ బుచ్చి వైపు చూశాడు.
పర్లెద్దూ మీకు నేను ఊరగాయ పెడతాను అంటూ వంట గదిలోకి దారి తీసింది బుచ్చి.
ఊరగాయ మన అందరిదీ అని రాగం తీస్తూ వెనకే నడిచాడు మన అప్పదాసు. అద్భుతః అని ఊరగాయ బద్దను చప్పరించాడు.