కవితా పురాణం
కవితా పురాణం


దత్తపాదం : " నిందారోపణముల్ హితమ్ము లొసంగును నీరజ పత్రేక్షణా "
పూరణం :
కందారు ణయశ శ్చంద్రిక లవెల యంగా న తద్విమ ర్శ మతి
విందార గింపున కై చేయు సుకర్మ వి షయ మ్ములఫ లితమ్ము
చెందార విమర్శ కులధ నాత్మక నె నరు స్వ పర వ్యాఖ్యల
నిందారో పణము ల్ హిత మ్ములొసం గును నీ రజ పత్రేక్షణా ||
భావం : ఓ నీరజ పత్రేక్షణా ! ప్రాభవమ్మగు కీర్తి చంద్రికలు వెలుగునట్లుగా ఆ
విమర్శలను మతి (అతి) లేదా బుద్ధి (మతి ) కి విందారగింపునకై చేయు
మంచి (సు) కర్మలు
అంటే మంచి పనుల యొక్క ఫలితమ్ములకు చెందిన
విధము గా ( చెందార) విమర్శకుల ధనాత్మక తనయొక్క /
ఇతరులయొక్క వ్యాఖ్యల నిందారోపణములు ఆరోపింప బడినవారికి
మేలే జరుగునని ఈ దత్తపాదము యొక్క భావం !
" అంటే సద్విమర్శలు( పాజిటివ్ - క్రిటిసిజం ) కవులు మరియు కళాకారులకు
కీర్తి శిఖరాలను అధిరోహించడానికి మేలే ఎక్కువ చేస్తుంది. ---- "
++++++++++++++ కవీశ్వర్