పంచకన్యా స్మరేన్నిత్యం
పంచకన్యా స్మరేన్నిత్యం
అయినా ఐదు మందితో కాపురం చేయమనడం ఏమిటో అని బుగ్గలు నొక్కుకునే వాళ్ళని చూసింది.
ఏక వస్త్రవో వివస్త్రవో అయినా సభకు రమ్మని ఆజ్ఞాపించిన దుర్యోధనుని మాటలు విని చింతించినది.
కురు వంశ కుల నాశిని అంటారేమో అని శోకించినది.
ద్రౌపదీ! నీకు కురు సభలో జరిగిన అవమానానికి ప్రతిక్రియ తప్పక జరుగును అని కృష్ణుడు పలికెను.
గోవిందా! యాజ్ఞాసేని ద్రౌపదిని నేను. అవమానాలే నా గుర్తుగా మిగులుతాయా అని కృష్ణుని ప్రశ్నించినది.
లేదు ద్రౌపదీ! నీవు పంచ కన్యలలో ఒకరుగా
గౌరవింపబడెదవు అని పలికెను కృష్ణుడు.