లక్ష్మి నివాసం
లక్ష్మి నివాసం
అది ఓ సాయంకాలం జయ భర్త గణపతి తో ముగ్గురు కొడుకులు ఉద్యోగాలకు వెళుతున్నారు కూతురు రుక్కు సంతోషం గ ఉంది. ఇక ఈ ఇంటికి పని నేను చెయ్యలేను పెద్ద వాడికి పెల్లు చేసెయ్యండి అంది. వాడికి ఎన్ని సంబంధాలు చూసేము ఎవరిని నచ్చుకోడం లేదు. మనమేం చేస్తాం అన్నాడు గణపతి.1000కిలోమీటర్ల దూరం నుండి కోడలిని వెతికి పెళ్లిచేసారు. ఓ సంవత్సరం తరవాత మావగారు పోయారు, అంతే పెద్ద కోడలు స్మిత కి కష్టాలు మొదలైయ్యాయి. అత్తగారు రచించిన రంపాలు పెడుతుంది. ఓ ఐదేళ్లలో ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళాయి. ముగ్గురు కొడుకులు వచ్చే పెళ్లాలను మనుషులుగానే చూడటం లేదు. బానిసలుగానే ఇంటి పని బయట పని అన్నీ చేస్తూ సర్దుకుపోతూ ఉన్నారు. ఆఖరి కోడలు అమ్మ చనిపోవడం తో పాపం తండ్రి సంవత్సరానికి ఓ సారి వచ్చేవారు. అంతే అత్తగారు నా కొడుకు సంపాదనంత వీళ్లకి వండే కరిగిపోతుందని తగువు పెట్టేది. అలానే మావగారు భోజనానికి వస్తే అతనికి పెట్టు అని భర్త లేచి వెళ్లిపోయే వాడు ఇదంతా గమనించిన గంగ తండ్రి తో నాన్న మీరింక మా ఇంటికి రాకండి. ఎందుకు మీకు ఈ అవమార్యాద. అని కూతురు ఏడుస్తూ పంపేసింది. పెద్ద కొడుకు సురేష్, స్మితలు గంగ వెడ్డింగ్ డే రోజు వాళ్ళ ఇంటికి వెళితే ఆ రోజు పాపం గంగ ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తుందో చెప్పదు. కానీ స్మితకు అక్కడేం జరిగింటుంది తెలుసు కనుక గంగకు ధైర్యం చెప్పి నువ్వు మెత్తగా ఉంటే నిన్ను వున్నపళంగా మింగేస్తారు.
ఇలా ఇరవై ఏలు గడిచేయి అత్త లక్ష్మి లో ఏ మాత్రమూ మార్పు రాలేదు మార్చి మార్చి కొడుకుల ఇళ్లల్లో ఉండడం వాళ్ళకి తగువులు పెట్టడం ఇదే పనిగా ఉంది కోడళ్లుగా ముగ్గురు అలసిపోయారు, ఇకన చేసేది లేక కొడుకులతో మీ అమ్మతో మీరూండండి మేము వెళ్లిపోతున్నాం అని చెప్పి వెళ్లిపోయారు పిల్లలను తీసుకొని. కొడుకులతో నైనా సుఖంగా వున్నాదా అంటే అదీ లేదు రోజూ కొడుకులతో కూడా తగువే ఇక చేసేది లేక అమ్మను వదిలేసి వాళ్ళ వాళ్ల భార్యల దగ్గరకు వెళ్లిపోయారు.