వాళ్ళు
వాళ్ళు
నువ్వు చెబితే వినే రోజులు పోయాయి.
ఎవరికి చెప్పాల్సిన రోజులు కావు.
వాళ్ళ కు తెలుసు అన్ని.
నువ్వు చెప్పిన వినరు కధ.
వాళ్లకు నచ్చిందే చేస్తారు.
చెప్పాలని చూడకు ఎవరికి.
నీకు ఏం తెలుసు అని విసుకుంటారు.
చెప్పడం కన్నా మౌనం మంచిది.
చెబితే వినే మనుషులు లేరు ఈ లోకం లో.
ఎవరి ఆలోచనలు వారికున్నాయి.
వాళ్లకు కొన్ని తెలియాలి.
అప్పుడే అర్థమవుతుంది.
అంతా అయిపోయాక వాళ్ళు చెప్పేది
వింటే బాగుండు అనుకుంటే ఏం లాభం లేదు.
జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
అంతా అయిపోతుంది .
చెప్పే వాళ్ళు ఉండడం అదృష్టం
ఆది వినకపోవడం మన దురదృష్ట మే.
