kondapalli uday Kiran

Children Stories Classics Inspirational

4  

kondapalli uday Kiran

Children Stories Classics Inspirational

అనుబంధం!

అనుబంధం!

1 min
265



రాధమ్మ ,సీతయ్య, అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లకి శశి అనే కొడుకు కూడా ఉండేవాడు. ఆ ఇరువురు దంపతులు చాలా కష్టపడి శశిని పెద్దపెద్ద చదువులు చదివించారు. శశి తల్లిదండ్రులు రెండు పూటలు మాత్రమే తినేవారు కానీ శశికి మాత్రం మూడు పూటలు అన్నం పెట్టేవారు ,అంత ప్రేమగా చూసుకునేవారు. శశికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం అమెరికాలో, ఒక విధంగా మంచిదైన శశిని విడిచి ఉండలేము అని బాధపడుతున్నారు. అందుకనే శశికి పెళ్లి కూడా చేసేశారు. శశి అమెరికా వెళ్ళిపోయాడు. 10 నెలలు గడిచాయి. రాధమ్మ, సీతయ్యలకు, శశిని చూడాలనిపిస్తుంది. శశి అమెరికా టికెట్లు కూడా బుక్ చేశాడు. తీరా వచ్చాక శశి నిరంతరం ఫోన్ తో , లేదా కంప్యూటర్ తోనే గడుపుతున్నాడు. అమ్మానాన్నలు వచ్చిన పట్టించుకోవడం లేదు. రాధమ్మ ఏంటయ్యా ఇది! వీడితో సరదాగా, సంతోషంగా, పది రోజులు గడుపుదామని వస్తే వీడేమో మనల్ని వదిలేసి ఆ ఫోన్ పట్టుకొనే తిరుగుతున్నాడు అని రాధమ్మ చాలా బాధపడుతుంది. అలా ఐతే వీడికి పై చదువులు చదివించకపోవాల్సింది. సీతయ్య అక్కడే బావుండు! మా స్నేహితులతో కలిసి ఒక చెట్టు దగ్గర కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్ళం. ఎంతో గొప్పగా చెప్పుకున్న నా కొడుకు అమెరికా వెళ్ళాడని తీరా చూస్తే ఇదీ పరిస్థితి. శశి డోర్ పక్కనే ఉన్నాడు. ఈ మాటలు విన్న శశి ఏడుస్తూ అమ్మ నన్ను క్షమించండి ఈ ఫోన్ మాయలోపడి మిమ్మల్నే మరిచిపోయాను. నాకోసం మీ ప్రాణాలు పోయేటట్టు కష్టపడ్డారు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు అలాంటిది మిమ్మల్ని విడిచి ఆ ఫోన్ తోనే గడుపుతున్నాను అని బాధపడ్డాడు. చివరికి సీతయ్య అరే నాన్న ఈ టెక్నాలజీ అనేది మనుషుల్ని దగ్గర చేయడానికి కాదురా దూరం చేయడానికి అని చెప్పాడు.


మనం ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ,ఏదైనా సరే మన తల్లిదండ్రుల తర్వాతే.


Rate this content
Log in