భూగర్భ నిధులు
భూగర్భ నిధులు
పూర్వం రాజులు తమ సంపదను ఖజానాలో ఉంచి దానికి రక్షణగా సైనికులను కాపలాగా ఉంచేవారు. మరి ధనవంతులైతే బందిపోట్లు
దోచుకుంటారనే భయంతో నేలను తవ్వి తమ
నగలను దాచుకునేవారు. ఈ విధంగా దాచిన
సొమ్ము తమ వారసులకు అందే విధంగా వారు
ఏర్పాటుచేసుకునేవారు. కొన్ని సార్లు ప్రకృతి
వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ యుద్ధాలు
వచ్చినప్పుడు వారసులకు వివరాలు అందించే
అవకాశం లేక ఆ నిధి నిక్షేపాలు భూమిలో అలా
ఉండిపోతాయి. అలాంటి నిధి నిక్షేపాల మీద
ఆశతో చాలా మంది పురాతన కోటలు ఉన్న
ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తుంటారు. అసలు
అలా లభించిన సంపద ప్రభుత్వానికి ఇవ్వాలని
చట్టం ఉంది. అయినా ఆ సంగతి గురించి వారు పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతూ ఉంటే
వారికి సహకరించే కొందరు స్వాములు మంత్రాలు
అవీ చెప్పి, పూజలు చేసి నిధులను వెలికి తీస్తాం
అని ఆశ చూపి దోచుకుంటున్నారు. కష్టపడి
సంపాదించిన సొమ్ము మనతో నిలుస్తుంది.
ఆ విషయం తెలిసి కూడా నిధి నిక్షేపాలు లభిస్తాయి,అయాచితంగా ధనం లభిస్తుంది
అనే కోరికతో చెయ్యరాని పనులు చేస్తుంటారు.
పని చేసుకుని సంపాదించిన సొమ్ము మనిషికి
తృప్తిని ఇస్తుంది.