తెలివైన నర్సు.
తెలివైన నర్సు.
కిష్టాయిపల్లి అనే గ్రామంలో కిష్టయ్య, దుర్గమ్మ అనే దంపతులుండేవారు. వారికి సంతానం కలుగలేదు. ఒకరోజు సరుకుల కోసం పట్టణానికి వెళ్లారు. అక్కడ ఒక చెత్త కుండీలో ఎవరో ఆడశిశువుని పారేసి వెళ్లారు. కిష్టయ్య దంపతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. తాము పెంచుకుంటామని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. పాపకు పాలు పట్టడానికి పాలపీక, సీసా కొన్నారు. సీసా నిండా పాలు నింపి పాపకు తాగించబోయారు.
పాప ఏడుస్తున్నది కానీ పాలు తాగడం లేదు. ఏం చేయాలో వారికి తెలియలేదు. పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ కి కూడా అర్థం కాలేదు. పాప మాత్రం పాలు తాగడం లేదు. అప్పుడు అక్కడే ఉన్న నర్సు పాలసీసాను లోపలికి తీసుకెళ్లి,కాసేపట్లో బయటకు తెచ్చి పాప నోటికి అందించింది. పాప ఏడుపు మాని పాలు తాగడం మొదలు పెట్టింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. "ఏం చేసావు" అని నర్సుని అడిగారు అందరూ. "పాల పీకకు రంధ్రం చేశాను" నవ్వుతూ చెప్పింది నర్సు.