మంత్రాల రాయి
మంత్రాల రాయి
అమ్మమ్మా! నీ స్వెట్టర్ జేబులో ఏదో ఉంది. అదేంటో నాకు చూపించవా అని కీర్తన అడిగింది.
మనవరాలు ఉదయం నుంచి అదే పట్టు పట్టడంతో
అందరూ పడుకున్నాక మేడ మీదకు తీసుకెళ్ళి చూపిస్తాను అని మనవరాల్ని ఊరుకోబెట్టింది.
చిన్నపిల్లలు ఏదైనా చెప్తే కాసేపు నమ్మి వింటారు. వాళ్ళు అనుకున్నది జరక్కపోతే ఇల్లు పీకి పందిరేస్తారు. ఆ సంగతి తెలుసు కాబట్టే కీర్తనకి అలా చెప్పి తన స్వెట్టర్ లోని మంత్రాల రాయిని జాగ్రత్తగా దాచిపెట్టుకుందామె.
రాత్రి కీర్తనను తీసుకుని మేడ మీదకు వెళ్ళి స్వెట్టర్ జేబులోంచి ఏదో విసిరింది. అమ్మమ్మ ఏం విసిరిందో తెలీదు కానీ ఆకాశంలో మిణుగురు పురుగులు కనిపించాయి.
కీర్తన చప్పట్లు కొట్టింది. కాసేపు వాటిని చూస్తూ ఆనందించిన కీర్తన మళ్లీ స్వెట్టర్లో ఏముందని అడిగింది. అమ్మమ్మ తన దగ్గర ఉన్న మంత్రాల రాయి గురించి చెప్పింది.
అయితే అది పెద్దవాళ్లు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి ఇక నిద్రపోదాం అని కిందికి తీసుకువెళ్ళింది.
మరుసటి రోజు ఉదయం కీర్తన కనిపించలేదు. స్వెట్టర్ జేబులోని మంత్రాల రాయి కీర్తనను ఎక్కడికో తీసుకువెళ్ళిందని అమ్మమ్మ వెతుకుతూ అడవిలోకి చేరింది.
కీర్తన చేతిలో మంత్రాల రాయి మెరుస్తూ ఉంది. ఆమె అడవిలోని గుహను చేరుకుంది.